Slider సినిమా

ఏప్రిల్ లో వస్తున్న “ఎర్రచీర – ది బిగినింగ్”

#erracheera

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. “ఎర్రచీర – ది బిగినింగ్” మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది.

శివరాత్రి కానుకగా “ఎర్రచీర – ది బిగినింగ్” గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కావలసి ఉంది. అయితే టెక్నికల్ కారణాలతో సినిమా రిలీజ్ వాయిదా వేశారు. వేసవి కానుకగా ఈ సినిమాని ఏప్రిల్ నెలలో  ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారని అన్నారు. సినిమా ఆలస్యం కావచ్చు కానీ కంటెంట్ మాత్రం కంటెంట్ ఖతర్నాక్ గా ఉందని చూసినవారు అందరూ అంటున్నారు అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

నటీనటులు

బేబి సాయి తేజస్విని, సుమన్ బాబు,  శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు, తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ – నాని, సుభాష్, స్టంట్స్ – నందు, డైలాగ్స్ – గోపి విమల పుత్ర, లైన్ ప్రొడ్యూసర్ – అబ్దుల్ రెహమాన్, సినిమాటోగ్రఫీ – చందు, ఎడిటర్ – వెంకట ప్రభు, చీఫ్ కో డైరెక్టర్ – నవీన్ రామ నల్లం రెడ్డి, రాజ మోహన్, బీజీఎం – ఎస్ చిన్న, మ్యూజిక్ – ప్రమోద్ పులిగార్ల, సౌండ్ ఎఫెక్ట్స్ – ప్రదీప్, పిఆర్ఓ – సురేష్ కొండేటి, సమర్పణ – బేబీ డమరి ప్రెజెంట్స్, నిర్మాత – ఎన్. వి.వి. సుబ్బారెడ్డి, సీహెచ్. వెంకట సుమన్, కథ – స్క్రీన్ ప్లే-  దర్శకత్వం – సుమన్ బాబు.

Related posts

కరోనా హెల్ప్: సాల్వేషన్ ఆర్మీ చర్చి ఆధ్వర్యంలో పండ్లు, గుడ్లు

Satyam NEWS

హైకోర్టు తీర్పుతో ఆనందోత్సాహాలలో ఉండవల్లి వాసులు

Satyam NEWS

అమ్మనాన్న వృద్దాశ్రమంలో దుస్తులు, పండ్లు ఇచ్చిన విద్యార్థులు

Satyam NEWS

Leave a Comment