నివర్ తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఎర్రబల్లె చెరువుకు నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో నీటి ప్రవాహాన్ని పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వేలూరు శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా వేలూరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎర్రబల్లె చెరువు పులివెందుల మండలానికి గుండె లాంటిది అని ఒకసారి చెరువు నిండితే 2 సంవత్సరాల వరకు మండలంలో కరువు ఉండదు అని చెరువుకు వరద నీరు వచ్చి చేరుతుందని ఇరిగేషన్ అధికారులు చెరువు కట్టను పరిశీలించి గండ్లు, మరమ్మతులు ఉంటే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో పులివెందుల తాలూకా అధికార ప్రతినిధి వెంకట్రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు