కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే సిబ్బంది లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడొద్దనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో 30 మందికి 15రకాల నిత్యావసర సరుకులతో పాటు మహిళలకు ఒక చీర, పురుషులకు ఒక టీ షర్ట్ అదేవిధంగా కల్వకుర్తి మున్సిపాలిటీలో పని చేసే మహిళ కార్మికులకు చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే దాతలు, కౌన్సిలర్ ల సహకారంతో అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు ఏజస్, గోరటి శ్రీనివాస్ లు,చిన్న రాం రెడ్డి, శ్రీధర్ రెడ్డి, చిన్న, శ్రీరాములు గౌడ్ పాల్గొన్నారు.
ఇంకా, మిర్యాల శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి రామకృష్ణ, సదానందం,నాని యాదవ్, చిత్తారి శ్రీను,పడకంటి వెంకటేష్, దున్న సురేష్,డాక్టర్ లు రమేష్ చంద్ర,యశోద,సందీప్, సాయి కృష్ణ, శ్రీ వాసు, హెడ్ సిస్టర్ ప్రసన్నకుమారి,సిబ్బంది,తదితరులు కూడా పాల్గొన్నారు.