బిచ్కుంద మండల కేంద్రంతోపాటు పెద్దదేవాడ గుండె నెమ్లి గ్రామాలలో నిరుపేద నిరాశ్రయులకు బియ్యం కూరగాయలు పప్పులు దాతల సహకారంతో ఆయా గ్రామాల సర్పంచులు అందజేశారు. బిచ్కుంద లో ఎంపిపి అశోక్ పటేల్ అందజేయగా ఆయా గ్రామాల వారిగా పెద్ద దేవాడలో సర్పంచ్ శివానంద్ గుండె నమిలిలో సర్పంచ్ రాణి కృష్ణారెడ్డి అందజేశారు.
ప్రతి ఒక్కరూ మానవత దృక్పథంతో నిరుపేదల కుటుంబాలను ఆదుకోవాలని ఎంపీపీ అశోక్ పటేల్ అన్నారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద సర్పంచ్ శ్రీరేఖ రాజు, ఉపసర్పంచ్ నాగరాజు పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు రాజు, తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి, ఎంపిటిసి చంద్రకళ రాజు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు లబ్ధిదారులు పాల్గొన్నారు.