కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలను ఆదుకోవడానికి ఎంతో మంది దాతలు ముందుకు వస్తున్నారు. అలాంటి వారిని తన వంతు కర్తవ్యంగా ఆదుకోవడానికి ప్రముఖ సంఘ సేవకుడు హైదరాబాద్ లోని అంబర్ పేట్ శంకర్ ముందుకు వచ్చారు.
లాక్ డౌన్ మొదలు అయిన నాటి నుంచి పేదలకు నిత్యావసరాలు పంచి పెడుతున్న అంబర్ పేట్ శంకర్ నేడు మరో 25మంది నిరుపేదలకు కందిపప్పు ఉల్లిపాయలు సన్న బియ్యం నూనె మొదలైన నిత్య అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా పేదలు ఇబ్బంది పడకుండా చూడాలన్నదే తన ధ్యేయమని అంబర్ పేట్ శంకర్ తెలిపారు.