లాక్ డౌన్ సమయంలో పేదలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ పేదలకు బియ్యం, పప్పు ఇతర నిత్యావసర వస్తువులు పంచి పెట్టారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరయ్యారు. నల్లకుంట డివిజన్ లోని గాంధీ నగర్ లంక బస్తీ ఆ చుట్టు ప్రక్కల ప్రాంతల కు చెందిన 175 కుటుంబాలు ఈ నిత్యావసరాలను అందుకున్నాయి. నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్కొక్కరికి నిత్యావసర వస్తువులు 10 కిలోల బియ్యం, కంది పప్పు, నూనె ప్యాకెట్, చింత పండు, కారం, పసుపు, శానిటైజర్ సబ్బులు తదితర వస్తువులను ఉచితంగా పంపిణి చేసినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు Ch. భగవాన్, నాగరాజ్ గౌడ్, k. శ్యామ్, హరి బాబు, j. కృష్ణ,, యాదయ్య, నర్సింహా, శ్రీనివాస్, నర్సింగ్ రావు పాల్గొన్నారు.