రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలంలోని కొండ్రిగానిబోడి తాండాలో ఈరోజు ఉదయం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. గ్రామస్ధులకు కోడిగుడ్ల తో పాటు నిత్యావసర వస్తువులను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి మాధవి కూడా పాల్గొన్నారు.
అనంతరం ఆరవ హరితహారం లో భాగంగా గాన్గుమర్ల తాండా గ్రామ పంచాయతీ శివారులోని రోడ్డుకు ఇరువైపులా సుమారు 2000 వేల చెట్లు వరకు నాటారు. అదేవిధంగా ఆమనగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందికి, రోగులకు త్రాగు నీటిని అందించే ట్యాంకును ప్రారంభించారు. ఆసుపత్రి సిబ్బంది ఒక్కొక్కరికీ 25 kgల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్ మండల, కడ్తాల మండలం ముఖ్య నాయకులు పాల్గొన్నారు