38.2 C
Hyderabad
April 25, 2024 11: 25 AM
Slider నల్గొండ

నిత్యావసరాలు వితరణ చేసిన ఎస్పీ సతీమణి లావణ్య రంగనాధ్

#Nalgonda Police

లాక్ డౌన్ కారణంగా ఉపాది కోల్పోయి ఇబ్బందులు పడుతున్న 175 పేద కుటుంబాలకు నల్లగొండ జిల్లా ఎస్పీ సతీమణి లావణ్య రంగనాధ్ నిత్యావసరాలు పంపిణీ చేశారు. బుధవారం ఎస్పీ రంగనాధ్ కుటుంబ సభ్యుల మనం కుటుంబ గ్రూప్ సహకారంతో నల్లగొండ పట్టణ శివారులోని లెప్రసీ కాలనీ, స్నేహా అనాధ శరణాలయం, చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లలో ఎస్పీ సోదరి, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అనురాధతో కలిసి ఆమె పేదలకు నిత్యావసరాలు అందచేశారు.

బుధవారం నల్లగొండ పట్టణ శివారులోని లెప్రసీ కాలనీ, చారుమతి, స్నేహా శరణాలయాలలో తమ కుటుంబ సభ్యులందరితో కలిసి ఉన్న మనం ఫ్యామిలీ గ్రూప్ ద్వారా సుమారు రెండున్నర లక్షల రూపాయల నిత్యావసరాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సిఐ బాషా, ఎస్.ఐ. నర్సింహులు, రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్పీ రంగనాధ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

ఉప్పల్ లో ఘనంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం

Satyam NEWS

రైతులను వ్యాపారులుగా మార్చడానికే వ్యవసాయ చట్టాలు

Satyam NEWS

లక్కీ మీడియా బ్యానర్ ఫలక్ నుమా హీరో

Satyam NEWS

Leave a Comment