బిచ్కుంద మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు షేక్ పాషా శేట్ వంద నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచి బియ్యంతో పాటు కూరగాయలు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేద కుటుంబాలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.
దీంతో సాహయం పొందిన కుటుంబాలు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాషా శేట్ తో పాటు ఎంపీటీసీ శాంతాబాయి ధన్సింగ్, వార్డు సభ్యురాలు సమీన బేగం జాఫర్ సునీత నారాయణ నిరుపేద కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.