ములుగు మండలంలో జంగాలపల్లి క్రాస్ రోడ్డు చెందిన కంచర్ల రాజు, కూతురు విక్షిత, కుమారుడు లియన్ష్, కంచర్ల నరేష్ కుమారుడు దృవాన్ష్ భార్గవ్ బర్త్ డే ను పురస్కరించుకొని బుధవారం దివ్యాంగులకు నిత్యావసరాలు అందచేశారు.
జంగాలపల్లి గ్రామానికి చెందిన నూనె సతీష్ కుటుంబానికి, జంగాలపల్లి క్రాస్ రోడ్డు కు చెందిన రెడ్డ బోయిన రాజు కుటుంబానికి ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం తో పాటు పండ్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కంచర్ల రాజమౌళి, కంచర్ల రాజు, కంచర్ల నరేష్, జర్నలిస్ట్ మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బర్త్డే వేడుకలు అంటూ హంగులు ఆర్భాటాలకు పోకుండా గ్రామానికి చెందిన దివ్యాంగులకు కుటుంబాలకు చేయూతను అందించిన కంచర్ల రాజు, నరేష్ లను గ్రామస్తుల తో పాటు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.