27.7 C
Hyderabad
March 29, 2024 05: 09 AM
Slider నిజామాబాద్

నిత్యావసరాలు అందించిన భగత్ సింగ్ సేవా సమితి

bhagath singh

కల్వకుర్తి పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో పని చేసే బీద,మధ్య తరగతి ఉపాద్యాయులకు,ఇతర రాష్ట్ర కూలీలకు భగత్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో సింగిల్ విండో చైర్మన్ తలసాని జనార్దన్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీశైలం బియ్యం,నిత్యావసర సరుకులను అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా తోచిన సహాయం అందిస్తున్నామని అన్నారు. కరోనా వల్ల లాక్ డౌన్ విధించినప్పటి నుండి అన్ని పాఠశాలలు మూసి వేశారని తెలిపారు.

బీద పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న వారికి తోడుగా ఉంటామని, ఇతర రాష్ట్ర కూలీలకు సహయ,సహకారాలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో దామోదర్ రెడ్డి, జితేందర్, హైమతాజీ, రాంభూషణ్, వీరెడ్డి మధు,TRSV నాయకులు ఆనంద్ గౌడ్,కృష్ణ మోహన్ తదితరులు  పాల్గొన్నారు.

Related posts

డబుల్ ఇళ్లలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పెట్టండి

Satyam NEWS

తెలంగాణ బాటలో నడుస్తున్న ఆంధ్ర ఆర్టీసీ

Satyam NEWS

వరంగల్ కు ఎక్కువ ఐటీ కంపెనీలు రావాలి

Satyam NEWS

Leave a Comment