కోవిడ్ టైం లో సంస్థ లో పనిచేసే కాంట్రాక్టు వర్కర్ల క్షేమం కోరుతూ రూరల్ మీటర్ రీడర్స్ కు నిత్యావసరవ వస్తువులను గుంటూరు జిల్లా నరసరావుపేట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టి. శ్రీనివాసబాబు పంపిణీ చేశారు. రూరల్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మొత్తం 25 మంది రూరల్ మీటర్ రీడర్స్ కి ముగ్గురు ప్రెవేటు బిల్లు కలెక్టర్లు కి ఒక్కొక్క రికి 25కిలోల బియ్యం,1కెజి కందిపప్పు,1కెజి మినప్పప్పు 1కెజి శనగ నూనె పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాట్లాడుతూ సాటి ఉద్యోగులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట టౌన్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడుకొండలు, అసిస్టెంట్ ఇంజనీర్ గురునాధ రావు, డి.1 అసిస్టెంట్ ఇంజనీర్ రాంబాబు, డి.2 అసిస్టెంట్ ఇంజనీర్ మహేశ్వర రెడ్డి, జూనియర్ ఇంజినీర్లు చంద్రశేఖర్, రామకృష్ణ, ఈ. అర్. ఓ సీనియర్ అసిస్టెంట్స్ మౌళి, బంగారయ్య పాల్గొన్నారు.