లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద వారికి సహాయం చేసే ఉద్దేశ్యంతో కల్వకుర్తి పట్టణంలో శ్రీ భక్త మార్కండేయ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ జరిగింది. పద్మశాలి సంఘం అధ్యక్షుడు నాగుల వెంకటేశ్వర్లు తిరుమల మోడ్రన్ జిన్నింగ్ మిల్లు ద్వారా సమకూర్చిన బియ్యం, కూరగాయలు, సబ్బులు, మాస్కులు, సానిటైజర్ లు పద్మ శాలి సంఘం ఆధ్వర్యంలో పేదలకు పంచి పెట్టారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ యడ్మ సత్యం, సింగిల్ విండో చైర్మన్ జనార్దన్ రెడ్డి, సంఘం కార్యదర్శి మస్న పాండు, కౌన్సిలర్ బోజీ రెడ్డి, రాజేందర్ నాయకులు నారాయణ, రఘు రాములు, బోడ నర్సింహ, రవి, రమేష్, శ్రీకాంత్, జంగయ్య, హరీష్ హాజరయ్యారు. ఇంకా సురేష్, మహేష్, భూషణ్, ఆనంద్,ప్రసాద్ , దుర్గా ప్రసాద్, విజయ్, సందీప్, వేణు తదితరులు కూడా పాల్గొన్నారు. దాదాపు 100 మందికి పైగా నేడు శ్రీ భక్త మార్కండేయ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ జరిగింది.