కృష్ణానది బ్రాహ్మణ పురోహితులకు, పారిశుద్ధ్య కార్మికులకు కు నిత్యవసర సరుకులు, కూరగాయలను సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పంపిణీ చేశారు. విజయవాడ సత్యనారాయణపురం గాయత్రీ కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణానది బ్రాహ్మణ పురోహితులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గాయత్రి సొసైటీ తరఫున నిత్యవసర సరుకులు కూరగాయలు అందచేసినట్లు ఆయన తెలిపారు.
తెల్ల రేషన్ కార్డు లేని వారు గ్రామ సచివాలయం వద్దకు వెళ్లి అప్లై చేసుకుంటే రేషన్ వస్తుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ పాటించాలని, ఇంటికే పరిమితం కావాలని మల్లాది విష్ణు పిలుపునిచ్చారు.