తాజా రాజకీయాలలో కేంద్ర బిందువు అయిన ఈటెల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణ దిశగా సాగుతున్నారు.
నేడు ఆయన తన సొంత నియోజకవర్గం అయిన హుజురాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
టీఆర్ఎస్ పార్టీ జెండా మోసింది చాలు ఇక బయటకు రండి అంటూ నినాదాలు చేశారు.
హైదరాబాద్ లోని తన నివాసం నుంచి భారీ కాన్వాయ్ తో నియోజకవర్గానికి వెళ్లిన ఈటల రాజేందర్ కు ప్రజలు జేజేలు పలికారు.
ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు రావడంతో మంత్రి వర్గం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే.