ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు మంత్రి మండలి నుంచి ఉద్వాసన పలుకనున్నట్లు సమాచారం. మెదక్ జిల్లా మూసాయిపెట్, అచ్చంపేట లో 100 ఎకరాల అసైన్డ్ భూమిని నిరుపేదల నుండి ఆక్రమించుకున్నడని ఆరోపణలు సీఎం పేషీ కి తాకడం తో దీనిపై విచారణ చేపట్టిన కే సి ఆర్ ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకోవాలని భావించినా ఈటెల పై టీ ఆర్ ఎస్ అనుకూల మీడియా లో సైతం కథనాలు రావడం చర్చనీ యాంశంగా మారింది. బీసీ మంత్రి పై ఇంతగా ఆరోపణలు రావడానికి తెర వెనుక స్వంత పార్టీలోని నాయకులే గోతులు తీసి ఈటెల ను బయటకు పంపాలని పథకం రచించినట్లు తెలుస్తుంది. దీనికి కొవిడ్ సమయాన్ని వాడుకున్నట్లు తెలుస్తోంది.
previous post