32.2 C
Hyderabad
April 20, 2024 20: 02 PM
Slider కరీంనగర్

అహంకారానికి…ఆత్మ గౌరవానికి మధ్య యుద్ధంలో ఈటెల గెలుపు

#etelarajendar

అధికారాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ సకల అస్త్రాలు ప్రయోగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినా చివరకు చైతన్యవంతమైన హుజురాబాద్ ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడి నిలబెట్టారని తీన్మార్ మల్లన్న టీం ములుగు జిల్లా కో కన్వీనర్ అచ్చునూరి కిషన్ అన్నారు. ఈటల రాజేందర్ గెలుపు లో  ప్రత్యక్షంగా, పరోక్షంగా  భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈటల రాజేందర్ ను ఎలాగైనా ఓడించడానికి ఎన్ని చేయాలో కేసీఆర్ అన్ని చేశారని ఆయన అన్నారు.

దళితుల ఓట్లను గంపగుత్తగా పొందాలని దళిత బందు పథకాన్ని ప్రవేశ పెట్టి హుజురాబాద్ కు వేల కోట్ల రూపాయలు తరలించారని ఆయన అన్నారు. బహుశా ఇంత ఖరీదైన ఎన్నిక తెలంగాణ లో ఇంతకుముందెన్నడూ జరగలేదని ఆయన అన్నారు. బీసీ ఓట్ల ను ఆకర్షించడానికి బీసీ కమిషన్ వేసి బీసీ కమిషనర్ తో మాట్లాడించారు.

ఆర్. కృష్ణయ్య లాంటి బీసీ నాయకులతో తమకు అనుకూలంగా మద్దతు ప్రకటించుకున్నారు…ఇలా అనేక రకాల ప్రయోగాలు చేసినా చైతన్యవంతమైన హుజురాబాద్ ప్రజలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి, దొరా అహంకారానికి స్వస్తి చెప్పి, ఈటల రాజేందర్ కు పట్టం కట్టారు అని ఆయన అన్నారు.

Related posts

తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ కర్తవ్యం

Satyam NEWS

కంటి పరీక్షలు తప్పనిసరి

Murali Krishna

యువకులకి కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం జరుగుతుంది

Satyam NEWS

Leave a Comment