ఐరోపా ఇంకా కరోనా పట్టులో ఉందని, పరిస్థితి ఇలాగే ఉంటే, ఈ శీతాకాలంలో ఇక్కడ మరణించే వారి సంఖ్య 22 లక్షలు కావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఐరోపాలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, రాబోయే నెలల్లో సుమారు 7,00,000 మంది ప్రాణాలు కోల్పోవచ్చని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేస్తోంది.
ఇప్పటి నుండి మార్చి 1, 2022 మధ్య, 53 దేశాలలో 49 దేశాలు ఐసీయూలో అధిక లేదా తీవ్రమైన ఒత్తిడిని కలిగి ఉండవచ్చని డబ్ల్యూహెచ్ విశ్వసిస్తోంది. దీంతో మృతుల సంఖ్య కూడా 22 లక్షలు దాటే అవకాశం ఉంది. కోవిడ్ సంబంధిత మరణాలు గత వారం రోజుకు 4,200కి పెరిగాయి. సెప్టెంబర్ చివరి నాటికి ఈ సంఖ్య 2,100గా ఉంది.