38.2 C
Hyderabad
April 25, 2024 14: 07 PM
Slider నల్గొండ

జాతీయ సమగ్రతను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి

భారతదేశ జాతీయ సమగ్రత సమైక్యతను భారతీయ పౌరులు ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని ఎంపిపి గూడెపు శ్రీనివాస్ కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరు సీతారామరాజు వర్ధంతి, జాతీయ గీతాన్ని రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి వేడుకల సందర్భంగా శనివారం వారి చిత్రపటాలకి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎంపిపి గూడెపు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన అమరవీరుల ఆశయాలను సాధించాలని పిలుపునిచ్చారు.అల్లూరి సీతారామరాజు,రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రపంచంలోనే భారతదేశానికి ఘన కీర్తిని గడించిన గొప్ప నాయకులని కొనియాడారు.మన్యందొర అల్లూరి సీతారామరాజు బ్రిటీషు దొరలను తరిమి కొట్టిన నాయకుడని అన్నారు . జనగణమణ గీతాన్ని రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను గొప్పగా చాటిచెప్పిన మహానీయుడని అన్నారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు సట్టూ సత్తయ్య,దుగ్గి వర్మ, అధికారులు నర్సిరెడ్డి, చంద్రకళ, భాస్కర్, శైలజ,అరుణ,అన్వేష్,ఉమామహేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ద‌స‌రా కానుక‌గా అజ‌య్ దేవ్‌గ‌న్ మైదాన్‌

Sub Editor

మరో క్వారంటైన్ లో మరో 800 పడకలు ఏర్పాటు

Satyam NEWS

ఆక‌ట్టుకుంటున్న ‘ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌’ ట్రైల‌ర్‌

Satyam NEWS

Leave a Comment