సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ నుండి ప్రధాన రహదారిలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.
అనంతరం శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరికి దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.హుజూర్ నగర్ నియోజకవర్గంలో 50 వేలకు పైగా దళితులు ఉన్నారని,ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకాన్ని వర్తింప చేయాలని అన్నారు.సియం కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాగానే దళితులనే ముఖ్యమంత్రి చేస్తానని,దళితులకు 3 ఎకరాల భూమిని ఇస్తానని,చేసిన వాగ్దానాలు నేటికీ అమలుకు నోచుకోలేదని,కల్లబొల్లి మాటలతో దళితులను మోసం చేసి ఇప్పుడు దళిత బంధు పేరుతో మోసం చేయాలని చూస్తే దళితులు మోసపోరని, రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దళిత ఓట్లతో ఓడిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమానికి సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు,పిసిసి జాయింట్ సెక్రటరీ ఎం డి అజీజ్ పాషా,జక్కుల మల్లయ్య, మున్సిపల్ కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి,ఎస్సీ నాయకులు ముక్కంటి,నారాయణ, వీరబాబు,దిలీప్ కుమార్,రాము,రాజేష్, రవీందర్,రాములు,మార్క్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్