విద్యార్థి దశ నుండే చట్టాల పైన, రాజ్యాంగంపై అవగాహన ఉంటే భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా వెలుగొందుతారని జూనియర్ సివిల్ జడ్జి ప్రదీప్ పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో శుక్రవారం మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో గిరిజన గురుకుల పాఠశాలలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు కల్వకుర్తి జూనియర్ సివిల్ జడ్జి ఏ ప్రదీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టాలపై అవగాహన కలిగి ఉండడం వల్ల సామాన్య ప్రజలకు రక్షణ తో పాటు మానసిక ధైర్యం పెరుగుతుందన్నారు. భారత రాజ్యాంగం మన దేశానికి ఎంతో తోడ్పాటునందిస్తుంది అన్నారు.
రాజ్యాంగ నిర్మాత స్ఫూర్తితో దృఢమైన రాజ్యాంగం ఏర్పాటు జరిగిందన్నారు ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టి ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ ప్రిన్సిపాల్ అలివేలు ,అడ్వకేట్ వి.వెంకట్ రెడ్డి ,మల్లేష్ మండల ప్యారా లీగల్ అడ్వైజర్ ఇంచార్జ్ కేశవ్ వాలెంటరీ ఆరిఫ్ ఫీల్డ్ అసిస్టెంట్ దేవయ్య కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, కల్వకుర్తి