మొక్కలు బతికించడం కూడా మనం కర్తవ్యంగా భావిస్తే ఆ మొక్కే పెరిగి పెద్దదై వృక్షం అవుతుందని అది మనల్ని సంరక్షిస్తుందని ‘విన్నపం ఒక పోరాటం’ రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతి అన్నారు. మొక్కే కదా అని దాన్ని బ్రతికించుకోకపోతే భవిష్యత్ తరాల్లో ప్రకృతి విలయతాండవంగా మారుతుందని అన్నారు.
హరితహారంలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలో ఆమె మొక్కలు నాటారు. మొక్కలను కాపాడుకుంటే పరోక్షంగా మన ప్రాణాలు, భావితరాల వారి ప్రాణాలను కూడా కాపాడిన వారమౌతామని, కనుక మనమందరం మొక్కలు నాటి వాటిని బ్రతికిద్దాం అని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ చీకూరి నాగలక్ష్మి, నేలపట్ల ఏయమ్మ, రోజా, తదితరులు పాల్గొన్నారు.