37.2 C
Hyderabad
March 29, 2024 20: 31 PM
Slider రంగారెడ్డి

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి

#uppalganesh

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాగస్వామ్యం కావాలని, కొరొనా నియమ నిభందనలు పాటించాలని కాప్రా డివిజన్‌ బీజెపీ అధ్యక్షుడు నండూరి రోహిన్‌కుమార్‌ అన్నారు. ఆదివారం  ఏఎస్‌రావు నగర్‌  డివిజన్‌  కమలానగర్‌లోని శ్రీసాయి ప్రెండ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్న గణేష్‌ నవరాత్రి ఉత్సవాలలో నండూరి రోహిన్‌కుమార్‌ ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం  అన్నప్రసాద వితరణ ప్రారంభించారు.  శ్రీసాయి ప్రెండ్స్‌ అసోసియేషన్‌   ఆధ్వర్యంలో జరిగిన అన్న ప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్బంగా నిర్వహకులు అరవింద్‌రెడ్డి, లితున్‌ లు మాట్లాడుతూ శ్రీసాయి ప్రెండ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి స్థానిక కాలనీ వాసులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై తీర్ధ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. కార్యక్రమంలో రఘురాం, సంతోష్‌, శరత్‌, సురేందర్‌రెడ్డి, లింగస్వామి, హర్షవర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌, వెంకటేశ్వరరావు, యుగేందర్‌, రమేష్‌యాదవ్‌, సుధాకర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పేదింట్లో కల్యాణలక్ష్మి కాంతులు తెలంగాణ ప్రత్యేకం

Satyam NEWS

తిరుమల-మెడికోవర్ సహాయంతో పోలీసులకు ఉచిత వైద్య పరీక్ష

Satyam NEWS

గ్రామీణులకు అండగా నిలిచిన టీఆర్ఎస్ నేత

Satyam NEWS

Leave a Comment