ఎన్నిక ఏదైనా తెలుగుదేశం పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ ఇంచార్జ్ కాట్రగడ్డ ప్రసూన, తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
సోమవారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్లమెంట్ అధ్యక్షుడు కూరపాటి అధ్యక్షతన జరిగిన పార్లమెంట్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్త కంకణబద్ధులై ఉండాలన్నారు.
త్వరలో జరగనున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించేందుకు నాయకులంతా కలిసికట్టుగా ఐక్యంగా పనిచేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిపించేందుకు పాటుపడాలన్నారు.
ఇందుకోసం నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు నిర్వహించాలన్నారు. పేద మధ్య తరగతి ప్రజలకు భారంగా మారిన నిత్యవసర వస్తువుల ధరలు ఇతర సమస్యలపై ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాడుతుందన్నారు.
తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉందని అందరూ కలిసికట్టుగా పనిచేస్తే విజయం మనదే అన్నారు. ఈ సందర్భంగా కాట్రగడ్డ ప్రసూనను ఘనంగా సన్మానించారు.
ఈ సమావేశంలో వాసిరెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు రామనాథం, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమోహన్ నాయకులు వల్లంకొండ వెంకట్రామయ్య, కనగాల సాంబశివరావు ,పారుపల్లి సురేష్, సూర్యదేవర లత, కొండబాల కరుణాకర్, గుత్తా సీతయ్య, కేతినేని హరీష్, రాయపూడి జై కర్, కోపేల శ్యామల, సాన బోయిన శ్రీనివాస్ గౌడ్, నల్లమల్ల వేణు, ఝాన్సీ, జర్పుల శ్రీనివాస్, మీగడ రామారావు, నందమూరి సత్యనారాయణ, తాళ్లూరు అప్పారావు, నాగండ్ల మురళి, తేళ్ల చిన్నయ్య ,రాజమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.