27.7 C
Hyderabad
April 20, 2024 00: 10 AM
Slider నల్గొండ

బిజెపి బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి

#BJP Hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు,చింతలపాలెం మండలాల భారతీయ జనతా పార్టీ సమావేశం సోమవారం సాముల సైదిరెడ్డి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాబోయే రెండు సంవత్సరాలలో పార్టీని బూతు స్థాయి నుండి బలోపేతం చేయాలని అన్నారు.ప్రజా సమస్యలపై పోరాడాలని పార్టీ ముఖ్య నాయకులను,కార్యకర్తలను కోరారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని, ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టులపై దాడులను భాగ్యరెడ్డి ఖండించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఇన్చార్జ్ చెనగాని నరేష్,రాష్ట్ర నాయకుడు జిల్లేపల్లి వెంకటేశ్వర్లు,జిల్లా ఉపాధ్యక్షుడు గాపర్తి శ్రీనివాస్ గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి సలికంటి నరేంద్ర,తోట శేషు,గుండెబోయిన వీరబాబు, చింతలపాలెం మండల బిజెపి అధ్యక్షుడు కాటెబోయిన లింగరాజు,బాల వేంకటేశ్వర్లు,గోపి,దేష్ రెడ్డి,రమేష్, రామారావు,ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

అటవీ అనుమతులపై రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు భేటీ

Satyam NEWS

ప్రొటెస్టు: పెన్షన్లలో కోత విధించడం దుర్మార్గమైన చర్య

Satyam NEWS

వినాయక చవితి హిందువుల తొలి పండుగ

Satyam NEWS

Leave a Comment