రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆడ్డబిడ్డ కోసం ఇస్తున్న పథకాలు దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వటం లేదని ఆయన తెలిపారు. బుధవారం హిమాయత్ నగర్ ఎమ్మార్వో కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు మొత్తం 37,04,292/- కళ్యాణ లక్ష్మీ చెక్కులను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉమారమేశ్ యాదవ్, అమృత, ఎమ్మార్వో లలిత, నాయబ్ ఎమ్మార్వో ఆసిఫ్ ఖాన్, స్పెషల్ ఆర్ఐ జగదీష్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
previous post