ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డీజీపీగా పని చేసిన ఐపీఎస్ అధికారి బి.ప్రసాదరావు గుండెపోటుతో మరణించారు.
అమెరికాలో ఉన్న ఆయన అర్ధరాత్రి 1 గంటకు మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రసాదరావుకు గుండెపోటు రాగానే అంబులెన్సుకు ఫోన్ చేశారు.
అయితే అంబులెన్సు వచ్చేలోపునే ప్రసాద రావు తుది శ్వాస విడిచారు.
నిబద్దత, ముక్కుసూటి వ్యక్తిత్వం కలిగిన బి.ప్రసాదరావు విశాఖ నగర పోలీస్ కమిషనర్ గా పనిచేశారు.
ఆనతి కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక రాష్ట్ర స్థాయి పదవులు చేపట్టి అనంతరం రాష్ట్ర డీజీపీ గా పదవిని అలంకరించారు. ఆ పదవికే ఎంతో హుందాతనాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఆయన.