40.2 C
Hyderabad
April 19, 2024 17: 16 PM
Slider ముఖ్యంశాలు

కరోనాతో మాజీ మంత్రి చందూలాల్‌ కన్నుమూత

#ajmeerachandulal

మాజీ మంత్రి, తెరాస నేత అజ్మీరా చందూలాల్‌ (67) గురువారం రాత్రి హైదరాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు.

మూడు రోజుల కిందట కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు,  కుమార్తె ఉన్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ములుగు మండలం జగ్గన్నపేటలో 1954 ఆగస్టు 17న జన్మించిన ఆయన సర్పంచిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్‌ హయాంలో, తెలంగాణలో కేసీఆర్‌ హయాంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు.

1996, 1998లలో లోక్‌సభ సభ్యునిగా గెలిచారు.

2005లో తెరాసలో చేరారు. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా పనిచేశారు.

Related posts

అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతిచ్చిన డీజీపీ

Satyam NEWS

22 పోలీస్ స్టేష‌న్లు…443 కిలోమీట‌ర్లు..విజయనగరం జిల్లాలో దిశ జాగృతియాత్ర‌

Satyam NEWS

జ‌ర్న‌లిస్టుల‌పై దాడుల‌ను అరిక‌ట్టాలంటూ క‌లెక్ట‌ర్ కు విన‌తి

Satyam NEWS

Leave a Comment