మునిసిపల్ ఎన్నికల ప్రచారం ముగిసినా రోడ్లపై తిరుగుతూనే ఉన్న కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై బిజెపి నాయకుడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
నిన్నటి తోనే ప్రచార పర్వం ముగిసినా కూడా రోడ్ల పై అనుచరులతో జమ్మలమడుగు పట్టణం లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తిరుగుతున్నారని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు.
నిన్నటి రోజున ప్రచారం అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు ఉదయం జమ్మలమడుగు పాత బస్టాండ్ సెంటర్ నుండి తన అనుచరులతో ఎమ్మెల్యే ములే సుధీర్ రెడ్డి తిరుగుతున్నట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి.