వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రానికి చెందిన రాజకీయ సీనియర్ నాయకుడు గాల్ రెడ్డి నిన్న సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. గ్రామ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ రోజు ఉదయం వారి స్వగ్రామం పానగల్ లోని వారి నివాసానికి వెళ్లి వారి భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కోడెరు మాజీ ఎంపీపీ రామ్ మోహన్ రావు కూడా గాల్ రెడ్డి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారి మృతి పట్ల జూపల్లి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి తీరనిలోటని.. ప్రగాఢ సంతాపం, సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారితో పాటు పానగల్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు జూపల్లి యువసేన నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.