కరోనా మహమ్మారి సోకడంతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మరణించారు. కొద్ది రోజుల కిందట కరోనాతో హాస్పిటల్లో చేరిన ఆయన తుది శ్వాస విడిచారు. బిజెపి లో ముఖ్య నాయకుడైన ఫైడికొండ మాణిక్యాలరావు కరోనాతో మరణించడం ఆ ప్రాంత ప్రజల్లో విషాదం నింపింది.
కరోనాను జయంచి తిరిగొస్తానంటూ వీడియో కూడా ఆయన విడుదల చేశారు. విజయవాడ హెల్ప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నేడు మరణించారు.