39.2 C
Hyderabad
April 25, 2024 16: 03 PM
Slider నల్గొండ

అన్నదానం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

#padmavathi

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డి ధర్మపత్ని, కోదాడ మాజీ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి జన్మదిన సందర్భంగా గురువారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో ఆమె పేరున  ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం అన్నదానంలో భాగంగా పేదవారికి భోజనం ప్యాకెట్లు అందించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు మాట్లాడుతూ పద్మావతి మేడం మంచి ఆయురారోగ్యాలతో,ఉన్నత పదవులను అలంకరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రెటరీ అజిజ్ భాషా, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి,వెలిదండ సరిత వీరారెడ్డి,కారంగుల విజయ వెంకటేశ్వర్లు, టౌన్ వర్కింగ్ అధ్యక్షుడు దొంతిరెడ్డి సంజీవరెడ్డి, ఉపాధ్యక్షుడు జక్కుల మల్లయ్య,

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాచిమంచి గిరిబాబు, సులువా చంద్రశేఖర్, దొంతాగాని జగన్, వంగవీటి బ్రహ్మం, బిక్కన్ సాహెబ్,చిన్నం శ్రీనివాస్,పాశంకోటమ్మ, సంక్రాంతి కోటేశ్వరరావు,దాసరి రాములు,పాలకూరి లాలు, జయరాజు,గడ్డం అంజి, వెంకటేశ్వర్లు,వీరబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే

Satyam NEWS

అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా

Bhavani

ఏపీకి ఐదుగురు నూతన ఐపీఎస్ అధికారుల కేటాయింపు

Satyam NEWS

Leave a Comment