పోలీసు యంత్రాంగంలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతిక సేవలను సద్వినియోగపరుచుకోవాలని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ సూచించారు. మంగళవారం ప్రభాకర్ వ్యవసాయ క్షేత్రంలో పచ్చి గడ్డి కోస్తుండగా నవరత్నాల ఉంగరం పోయింది. ఈ విషయాన్ని రాచకొండ సి పి కి తెలియజేశారు. ఉన్నత స్థాయి సాంకేతిక బృందం తనిఖీలు నిర్వహించారు. పోలీసు యంత్రాంగం డాగ్స్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్లు సహాయంతో నిమిషాల మీద ఈ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఉంగరాన్ని కనుగొన్నారు. రాచకొండ పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా