కేసీఆర్, కేటీఆర్ అంటే కల్వకుంట్ల రావులు కాదని, కల్వకుంట్ల కమీషన్ రావులని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ ఎద్దేవా చేశారు. మంగళవారంనాడు బీహెచ్ఇఎల్లోని భారతీనగర్లో జరిగిన ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొని రోడ్షోలో ప్రసంగించారు. అడుగడుగునా ప్రజలను, ఓటర్లను ఉత్సాహ పరుస్తూ ఆయన పర్యటన కొనసాగింది. తెలంగాణకు కల్వకుంట్ల కమీషన్ రావులు అవసరమా? అని ప్రశ్నించారు. తెలంగాణను మాత్రం ఏ మాత్రం పెంచకుండా వారి వారి ఆస్తులు మాత్రం ఎన్నో రెట్లు పెంచుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసిన వారిలో కల్వకుంట్ల కమీషన్రావులే ముందువరుసలో ఉంటారన్నారు. వివేక్ మాటలు రోడ్షోలో పలు ఆలోచనలు రేకెత్తించాయి. ఆయన పర్యటన ఆసాంతంలో ప్రజల ద్వారానే జవాబులు రాబట్టడం విశేషం.
previous post