నాటు సారా స్థావరాలపై ఎక్సయిజ్ అధికారులు దాడులు చేసి పెద్ద ఎత్తున నాటు సారా పట్టుకున్నారు. మహబూబ్ నగర్ ఎన్ ఫోర్సు మెంటు అధికారులు, నాగర్ కర్నూల్ డిటిఎఫ్, కొల్లాపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ లు సంయుక్తంగా ఈ దాడులు జరిపారు.
కొల్లాపూర్ మండలంలోని బోడబండ తండా, కోడేర్ మండలంలోని నాగులపల్లి తండాలలో దాడులు నిర్వహించినట్లు ఎక్సయిజ్ సిఐ ఏడు కొండలు తెలిపారు. మొత్తం ఐదు కేసులు నమోదు చేసి 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు.
అదే విధంగా 70 కిలోల బెల్ల ఊట, 600 లీటర్ల ఎఫ్ జె వాష్ లను కూడా ధ్వంసం చేసినట్లు ఏడుకొండలు తెలిపారు.