వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కొప్పునూరు గ్రామంలో నల్ల బెల్లం అమ్ముతున్నారని సమాచారంతో దాడులు నిర్వహించామని అధికారులు తెలిపారు. ఈ దాడులలో సుమారు 13వేల ఎనిమిది వందల కిలోల నల్ల బెల్లం స్వాధీనం చేసుకుని రమేష్ పై కేసు నమోదు చేశామని తెలిపారు.
ఈ దాడులలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మహబూబ్ నగర్ సి ఐ గణపతి రెడ్డి, వారి సిబ్బంది వనపర్తి ఎక్సైజ్ సీఐ సుభాష్ చందర్ రావు, సిబ్బంది పాల్గొన్నారు. నాటు సారా తయారీ గురించి ఎవరైనా బెల్లం అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
నాటు సారా తయారీ దారులు, అమ్మకందారులు కూడా తమ పద్ధతులను మార్చుకుని నాటుసారా తయారు చేయడం మానుకోవాలని కోరారు. నాటు సారా తయారీ కి బెల్లం అమ్మకం చేసే వారి గురించి సంబంధించిన సమాచారం సెల్ నెంబర్ 9440902625 కి ఫోన్ చేయాలని ఆబ్కారీ ఇన్స్ పెక్టర్ సుభాష్ చందర్ రావు ప్రజలను కోరారు.