25.7 C
Hyderabad
May 24, 2025 08: 25 AM
Slider విశాఖపట్నం

పరవాడ ప్రమాద బాధితులకు పరిహారం

#Minister Muttamshetti

పరవాడ ఫార్మా సిటీ లోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో జూన్  29 వ తేదీన జరిగిన హైడ్రోజన్ సల్ఫైట్ గ్యాస్ లీకేజీ ఘటన లో మరణించిన మహంతి గౌరీ శంకర్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఎక్స్ గ్రేషియా రూ.15.00 లక్షల మొత్తానికి చెక్కు ను  ఆయన భార్య కోట్ల వెంకట లక్ష్మి కి  శనివారం నాడు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తన నివాసంలో అందజేశారు.

అలాగే సాయినార్ కంపెనీ తరపున ఇస్తున్న ఎక్స్ గ్రేషియా రూ. 35.00 లక్షల మొత్తానికి సంబంధించి ఆయన భార్య కోట్ల వెంకట లక్ష్మి కి రూ. 10.00 లక్షల చెక్ ను, తండ్రి మహంతి లక్ష్ము నాయుడు కు రూ. 12.50 లక్షల చెక్ ను, తల్లి మహంతి అప్పల నరసింహ కు రూ. 12.50 చెక్ లను కూడా మంత్రి చేతుల మీదుగా అందజేశారు.

Related posts

దిశ యాప్: 21 నిమిషాల్లో 25 కిలోమీటర్ల దూరానికి పోలీసులు

Satyam NEWS

సర్వీస్ ఎఫైర్: కాగజ్ నగర్ లో లయన్స్ క్లబ్ రీజియన్ మీట్

Satyam NEWS

ఏపి బడ్జెట్: పాత సీసాలో పాత సారానే

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!