లాక్ డౌన్ సందర్భంగా మద్యం సరఫరా నిలిచిపోవడంతో గ్రామాల్లో పెద్ద ఎత్తున నాటు సారా ఎక్కువ అయిపోయింది. దాంతో ఎక్సయిజ్ శాఖ అప్రమత్తం అయింది. నాగర్ కర్నూల్ డిటీఎఫ్ ఎక్సయిజ్ సిఐ పరమేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నేడు జరిపిన దాడుల్లో పెద్ద ఎత్తున నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు.
కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి గ్రామ సమీపంలో ఎక్సయిజ్ పోలీసులు జరిపిన ఈ దాడిలో 1200 కిలోల బెల్లం, పటిక స్వాధీనం చేసుకున్నారు. వీటిని రవాణా చేస్తున్న ఒక బొలేరో వాహనాన్ని సీజ్ చేసి ఒక వ్యక్తి ని అదుపులోకి తీసుకున్నట్లు కొల్లాపూర్ ఎక్సయిజ్ సిఐ ఏడుకొండలు వెల్లడించారు.