సూర్యాపేట పోలీసులు భారీ ఎత్తున పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం రోడ్ లో అమ్మ గార్డెన్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ విషయం వెల్లడి అయింది.
సూర్యాపేట సీఐ A. ఆంజనేయులు ఎస్ ఐలు బి.భిక్షపతి, పి. శ్రీనివాస్ లు విధినిర్వహణలో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఒక ఐ-20 కారు, అందులో ఇద్దరు వ్యక్తులు, ఒక అశోక్ లేలాండ్ ట్రాలీ ఆటో, ఆటో లో ఇద్దరు వ్యక్తులు అందరూ కలిసి వెళుతుండగా పొలీసులు ఆపారు.
ఆ వాహనాలు సూర్యపేట వైపు నుండి ఖమ్మం వైపు వెళుతున్నాయి. వివరాలు అడిగితే వారు చెప్పలేకపోవడంతో అనుమానించిన పోలీసులు వాటిని తనిఖీ చేశారు.
అశోక్ లేలాండ్ ట్రాలీ ఆటో లో 60 -తెల్లని బస్తాలలో పేలుళ్ళ కు ఉపయోగించే అమోనియా నైట్రేట్ ఉండగా దానికి సంబంధించిన ఎలాంటి అనుమతి పత్రాలు వారి వద్ద లేవు.
దాంతో మొత్తం నలుగురు వ్యక్తులను, కారు, అశోక్ లేలాండ్ ట్రాలీ ఆటోను 60 బస్తాల అమోనియా నైట్రేట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హనుమపురం కు చెందిన తోటకూర సురేందర్, వరంగల్ జిల్లా ఖానాపురం కు చెందిన వెల్లుల్లి నవీన్ కుమార్, భువనగిరి కి చెందిన డ్రైవర్ బబ్బిలి శివ కుమార్, కూలి పని చేసే పడాల యేసు పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఉన్నారు.
మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.