40.2 C
Hyderabad
April 19, 2024 17: 06 PM
Slider హైదరాబాద్

ఎక్స్ ప్లోజన్: హైదరాబాద్ నడిబొడ్డున భారీ పేలుడు

explossion

చెత్తకుప్పలో భారీ పేలుడు సంభవించిన భయానక సంఘటన హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ముషీరాబాద్ లో కొద్ది సేపటి కిందట జరిగింది. చెత్త ఏరుకుంటున్న నాగయ్య అనే వ్యక్తి కి ఈ పేలుడులో తీవ్ర గాయాలు అయ్యాయి. చెత్త కుప్పలో బాంబు ఉంటుందని ఊహించని నాగయ్య ఎప్పటి లాగే చెత్త ఏరుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్క సారిగా పేలుడు సంభవించడంతో ముషీరాబాద్ ప్రాంతం ఉలిక్కిపడింది.

ఈ ప్రమాద నుంచి నాగయ్య తృటిలో ప్రాణాలతో బయట పడ్డాడు. సంఘటన గురించి సమాచారం అందుకోవడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. గాయాలు అయిన వ్యక్తిని గాంధీ ఆసుపత్రి కి పోలీసులు తరలించారు. ఉదయం 11:20నిమిషాలకి ఘటన జరిగింది. పేలుడు శబ్దం 300 మీటర్ల వరకు వ్యాపించింది. పోలీసుల దర్యాప్తులో తేలింది ఏమిటంటే అక్కడ చెత్త కుప్పలో ఒక కెమికల్ డబ్బాను ఎవరో ఉంచారు.

ఆ డబ్బా పేలినట్లు పోలీసులు గుర్తించారు. కెమికల్ డబ్బా ఎలా బ్లాస్ట్ అయిందో పరిశీలిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.

Related posts

క్రమబద్ధీకరణ ప్రక్రియలో పొరపాట్లుకు తావుండవద్దు

Murali Krishna

బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి

Bhavani

కరోనా కట్టడిలో రాజీ పడని వనపర్తి పోలీసులు

Satyam NEWS

Leave a Comment