కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 65 ఏళ్ల నుంచి అదనపు పింఛను ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని పార్లమెంటరీ స్థాయీసంఘం చేసిన సిఫార్సులను ఆర్థికశాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. 65 ఏళ్లవారికి 5%, 70 ఏళ్లకు 10%, 75 ఏళ్లకు 15% పింఛను అదనంగా ఇవ్వా లని పార్లమెంటరీ స్థాయీసంఘం సిఫార్సు చేసి నట్లు ఆయన రాజ్యసభలో చెప్పారు.
అదనపు పింఛను ఇవ్వాలన్న పింఛనుదారుల సంఘం డిమాండును ప్రభుత్వం పరిశీలించాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం తన 110వ నివేదికలో పేర్కొంది. ఈ మేరకు వివిధ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని అనుసరించి ఈ సిఫార్సులు అమలుచేస్తే తలెత్తే ఆర్థిక ప్రభావాలను లెక్కించి ఈ అంశాన్ని కేంద్ర ఆర్థికశాఖకు ప్రతిపాదించాం అని మంత్రి చెప్పారు.