27.7 C
Hyderabad
April 25, 2024 09: 15 AM
Slider ప్రత్యేకం

కార్పొరేట్ కు  ధీటుగా మన ఊరు మన బడి

#mulugucollector

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 125 ప్రభుత్వ పాఠశాలలు మొదటి దశలో ఎంపిక కాగా నేటి వరకు 13 పాఠశాలలు సర్వంగ సుందరంగా ముస్తాబైనట్లు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. జిల్లాలో విద్యాభివృద్ధి ద్యేయంగా విద్యార్థులకు పాఠశాల భవనాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన నిధులతో అదనపు తరగతి గదులు అధునాతన మరుగుదొడ్లు మూత్రశాలలు తాగునీటి వసతి కిచెన్ షెడ్లు వాకింగ్ ట్రాకులు గ్రీనరీ డ్యూయల్ డెస్క్లు బ్లాక్ బోర్డులు డిజిటల్ క్లాస్ రూమ్స్ లైబ్రరీ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్  ఫర్నిచర్ సమకూర్చుకున్నాయి. నూతన భవన నిర్మాణాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా శిథిల వ్యవస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాల భవన నిర్మాణాలు పునర్నిర్మానాలు చేసి సుమారు జిల్లాకు 125 పాఠశాల గాను 26.5కోట్లు రూపాయలతో మంజూరు కాగా అందులో 13 పాఠశాలలో పూర్తయి అందుబాటులోకి వచ్చియని కలెక్టర్ తెలిపారు.

ఏటూర్ నాగారం మండలంలో ఆకుల వారి ఘనపురం ప్రాథమిక పాఠశాల, ఏటూర్ నాగారం ప్రాథమిక పాఠశాల, గోవిందరావుపేట్ మండలకేంద్రంలో ప్రాథమిక పాఠశాల ,కన్నాయిగూడెం మండలంలో ప్రాథమిక పాఠశాల గుర్రేవుల, మంగపేట మండలం ప్రాథమిక కోన్నంత పాఠశాల బాలన్న గూడెం, ములుగు మండలం ప్రాథమిక పాఠశాల మల్లం పల్లి, తాడ్వాయి మండలం ప్రాథమిక పాఠశాల ఇంద్ర నగర్, వెంకటాపూర్ మండలం ప్రాథమిక పాఠశాల బూరుగు పేట, వెంకటాపూర్ మండలం ప్రాథమిక పాఠశాల ఇంచెన్చెరువు పల్లి, వెంకటాపురం మండలం ప్రాథమిక పాఠశాల నాయకుల గూడెం, వెంకటాపురం మండలంలో ప్రాథమిక పాఠశాల ఆర్ఆర్ పురం కాలనీ, వాజేడు మండలం ప్రాథమిక పాఠశాల బొల్లారం ప్రాథమిక పాఠశాల రామాపురం పాఠశాల భవనాలు నేటి వరకు అన్ని సౌకర్యాలతో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా సర్వంగా సుందరంగా ముస్తాబయి విద్య అభివృద్ధి కోసం అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్ వివరించారు.

మహేందర్ గౌడ్ కూనూరు, సత్యం న్యూస్ ప్రతినిధి ములుగు

Related posts

కార్పొరేషన్ నిధులు కూడా దారి మళ్లిస్తున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్నారు…!

Satyam NEWS

జీ 7 సదస్సులో పాల్గొనేందుకు వెళుతున్న మోడీ

Satyam NEWS

Leave a Comment