కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కూడా ప్రాణాలకు తెగించి విధి నిర్వహణలో ఉన్న పోలీసుల రక్షణ కోసం ఐసీఐసీఐ బ్యాంకు మాస్కులు అందచేసింది. నేడు నిర్మల్ జిల్లా ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ అశోక్, అసిస్టెంట్ మేనేజర్ తిరుపతి షీల్డ్ ఫేస్ కవరేజ్ మాస్కులు, సనిటైజార్ లను ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ శశిధర్ రాజుకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాస్కులు అందజేసిన ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ ను అభినందించారు. అహర్నిశలు విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి వీటిని అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ వెంకటేష్, ఎస్పీ సీసీ రమణ తదితరులు పాల్గొన్నారు.