తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఎన్నికైన సందర్భంగా అల్లం ప్రభాకర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఘనంగా సన్మానించారు. ఈరోజు అల్లం ప్రభాకర్ రెడ్డి నివాసంలో వారిని కలిసి ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు తినిపించి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సుతారి జానకి వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టణ ఉపాధ్యక్షులు జక్కుల మల్లయ్య,పట్టణ ఐఎన్టీయూసీ అధ్యక్షులు పాశం రామరాజు,పట్టణ యూత్ కాంగ్రెస్ నాయకులు సులువు చంద్రశేఖర్, DSR ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబూరావు, గడ్డం వీరయ్య, యల్లావుల వీరయ్య, యాసిన్,తదితరులు పాల్గొన్నారు.