ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో నకిలీ బంగారు బిస్కెట్లు విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులు రిమాండ్ కు తరలించారు. బేస్తవారిపేట మండలం చిన్న ఓబునేని పల్లి గ్రామానికి చెందిన గురువర్ కుమార్ కు ఫోన్ ద్వారా పరిచయమైన కోటేశ్వరమ్మ, సురేష్ మాయమాటలు చెప్పి తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు ఇప్పిస్తామని గురువర్ కుమార్ ను రెండు లక్షల రూపాయలు తీసుకొని మోసగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అనంతరం నిందితులను రిమాండ్ కు తరలించినట్లు కంభం సీఐ రాజేష్ కుమార్ వెల్లడి.
next post