కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని గూడెం గ్రామంలో నిషేధిత పత్తి విత్తనాల నిలువలు ఉన్నాయని పక్క సమాచారం మేరకు గురువారం కౌటాల సిఐ బుద్దస్వామి ఆధ్వర్యంలో పలు ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు.
ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో నకిలీ పతి విత్తనాలు ఉన్నాయని పక్క సమాచారం మేరకు సోదాలు చేయగా ఆ గ్రామానికి చెందిన ఎండి ఫారూఖ్ ఇంట్లో 2 క్వింటాల 35 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీన పర్చుకున్నాం అన్నారు.
అదే విధంగా అతని వద్ద కొనుగోలు చేసి నిల్వ ఉంచుకున్న బెజ్జూర్ మండలంలోని ఇప్పలగూడెం గ్రామానికి చెందిన యేండ్లురి హుస్సేన్ వద్ద 90 కిలోల విత్తనాలను స్వాధీన పర్చుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏడి ఏ రాజుల నాయుడు, మండల వ్యవసాయ అధికారి రాజేష్ తదితరులు ఉన్నారు.