విద్యుత్ షాక్ తో ఓ రైతు మృతి చెందిన సంఘటన నియోజకవర్గ కేంద్రమైన సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణం లో శనివారం చోటు చేసుకుంది.
రైతు బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దుబ్బాక పట్టణానికి చెందిన ఎంగారి రాములు(65) అనే రైతు ఉదయం తన వ్యవసాయ పనుల కోసం తనకున్న మూడు ఎకరాల పొలం వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రాములు అక్కడికక్కడే పొలం లో పడి మృతి చెందాడు.
మృతునికి భార్య బాలవ్వ కొడుకు రాజిరెడ్డి కూతురు కవితలు ఉన్నారు. విద్యుత్ షాక్ తో మృతి చెందిన రైతు రాములు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు ప్రభుత్వాన్ని కోరారు.