వీరఘట్టాం మండలం కుంబిడి గ్రామం వద్ద పొలాల్లో ఓ ఏనుగు ఘీంకారాలు చేస్తూ అలజడి సృష్టిస్తుంది. నాలుగు ఏనుగుల గుంపు నుంచి దారి తప్పిన ఒక ఏనుగు గ్రామంలో పోలాల వద్ద హల్చల్ చేసింది. దీంతో కుంబిడి, మూలలంక, కొత్తకోట పరిసర గ్రామస్తులు, రైతులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గుంపులోంచి తప్పిపోయిన ఏనుగును, తిరిగి ఏనుగుల గుంపులో కలిపేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
previous post