37.2 C
Hyderabad
March 29, 2024 17: 51 PM
Slider మహబూబ్ నగర్

నో సొల్యూషన్: కిరోసిన్ డబ్బాలతో కలెక్టరేట్ ఎక్కిన రైతులు

gopulapuram

ఉన్నతాధికారులను అడిగిలే సమస్యలు లేవు అంటారు. రాజకీయ నాయకులను అడిగితే ఎవడ్రా సమస్య ఉందన్నది అంటూ కన్నెర్ర చేస్తారు. మరి సమస్యలు ఎవరు తీరుస్తారు? ఇదే గోపులాపురం గ్రామానికి చెందిన రైతుల ఆవేదన. తాము కొనుగోలు చేసిన భూమికి పాస్ పుస్తకాలు అడుగుతున్నారు వారు.

కానీ తహసిల్దార్ ఇవ్వడం లేదు. ఎన్ని సార్లు తిరిగినా చెప్పులు అరుగుతున్నాయి తప్ప పాస్ పుస్తకాలు రావడం లేదు. ఎన్ని సార్లు అడిగినా నోరు నెప్పి పుడుతున్నది తప్ప పని కావడం లేదు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ముందు పెంట్లవెల్లి మండలం గోపులపురం గ్రామానికి చెందిన పలువురు రైతుల ధర్నా చేశారు. దీనితోనైనా తమ సమస్య తీరుతుందని వారు భావించారు.

అయితే స్పందన లేదు దాంతో కిరోసిన్ డబ్బాలతో కలెక్టరేట్ పైకి ఎక్కి తమ నిరసన తెలిపారు. శరీరానికి నిప్పంటించుకుని పై నుంచి దూకుతామని హెచ్చరించారు. వారి ఆవేదన పట్టించుకోకపోతే వారి సమస్య తీరకపోతే దారుణం జరుగుతుంది. అధికారులూ జాగ్రత్త.

Related posts

అసదుద్దీన్ తో సానియా మీర్జా చెల్లెలి వివాహం

Satyam NEWS

ఫ్రూట్ ఫుల్ సెర్చ్ : సంకల్పబలం 20ఏళ్ల తరువాత తల్లితో

Satyam NEWS

అధికారం కోసం అన్నీ మోసాలే చేసిన కేసీఆర్

Bhavani

Leave a Comment