దేశ రాజధాని ఢిల్లీ నగరంలో తీవ్ర చలి, భారీ వర్షంలో ఆందోళన చేస్తున్న రైతుల పోరాటం మరో జాతీయ పోరాటంగా ఉందని, మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని ప్రతిజ్ఞ చేస్తున్న రైతుల పోరాటం అమోఘమని జిల్లా CITU ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సి ఐ టి యు కార్యాలయంలో విలేకరులతో రోషపతి మాట్లాడుతూ ఈనెల 5న, జరిగిన బిల్డింగ్ వర్కర్స్ నూతన కమిటీ ఆధ్వర్యంలో పూర్తి కమిటీని ప్రకటిస్తూ, ప్రజలు కావాలా? కార్పొరేట్లు కావాలా? నిర్ణయించుకునే సమయం టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుందని, ఉద్యమాలు పార్టీగా ఉన్న పేరు ఈ పోరాటంలో ముందుండి పోరాటం చేయాలని ప్రభుత్వాని కోరారు.
నూతనంగా ఏర్పడిన తెలంగాణ శిల్పకళ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రకటించారు.
సి ఐ టి యు అనుబంధ సంఘం గౌరవ అధ్యక్షుడు శీతల రోషపతి, అధ్యక్షుడుగా ఉప్పుతల వెంకన్న,ఉపాధ్యక్షుడు పల్లపు రామకృష్ణ, చల్ల జయకృష్ణ, ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్,సహాయ కార్యదర్శి శీలం వేణు,కోశాధికారి ఉప్పుతల నరేష్,నగేష్ సుభాని, శ్రీను, రాజు, అక్బర్, సోమేశ్, సాయి, సతీష్, తదితరులు కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు
అభినందనలు తెలిపిన వారిలో ఆ సంఘం మండల అధ్యక్షుడు ఉప్పల గోవిందు ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తాఫా తదితరులు ఉన్నారు.